విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. చాలాకాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండగా అది మధ్యలోనే నిలిచిపోయింది.
శంకర్ దర్శకత్వంలో కమల్, కాజల్ జంటగా నటిస్తుండగా దర్శకనిర్మాతల మధ్య నెలకొన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల షూటింగ్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గతకొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉన్న కారణంగా దర్శకుడు శంకర్ టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.అయితే, ఇటీవల వచ్చిన ‘విక్రమ్’ మూవీ సక్సెస్ మీట్లో ‘ఇండియన్ 2’ మూవీపై కమల్ క్లారిటీ ఇచ్చారు.
దర్శకనిర్మాతల మధ్య సమస్యలు తొలగిపోయాయని, ఆర్సీ 15 తర్వాత మా ‘ఇండియన్ 2’ మొదలవుతుంది అని వెల్లడించారు.