బర్త్ డే…మొక్కలు నాటిన కల్వకుంట్ల హిమాన్షు..

303
gic
- Advertisement -

ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్ గారి తనయుడు కల్వకుంట్ల హిమాన్షు.

ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు, హరితహారం కార్యక్రమం లో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం హిమాన్షుకు ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

తను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టిన విజయవంతంగా అమలు చేసినందుకు డయానా జాతీయ స్థాయిలో అవార్డు రావడం హిమాన్షు కు ఈ సంవత్సరం ఎంతో గొప్పది అని. అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా నాతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషకరమైనది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నాని తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలియజేశారు.

- Advertisement -