సీఎం కేసీఆర్ కు కృత‌జ్న‌త‌లు తెలిపిన క‌ల్న‌ల్ సంతోష్ తండ్రి

687
kalnal santhosh father
- Advertisement -

భార‌త్ చైనా స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రుడైన చెందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్లు ఆర్థికసాయం ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇక, సంతోష్ బాబుతో పాటు ఆ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా తానే స్వ‌యంగా వెళ్లి ఈస‌హాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

త‌మ కుటుంబాన్ని ఆదుకున్నందుకు మఖ్య‌మంత్రి కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపి చేతులెత్తి న‌మ‌స్క‌రించారు సంతోష్ బాబు తండ్రి ఉపేంద‌ర్. ఇక అమ‌రుడైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్ర‌భుత్వ‌ం అండ‌గా నిల‌వ‌డంతో దేశ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన‌ సంతోష్ బాబు కుటుంబానికి అండ‌గా నిలిచినందుకు సీఎం కేసీఆర్ కు కృత‌జ్న‌త‌లు తెలుపుతున్నారు ప్ర‌జ‌లు.

- Advertisement -