అద్భుతం ఆవిష్కృతమైంది:కాళేశ్వరంపై రవితేజ

428
raviteja
- Advertisement -

తెలంగాణ ప్రజల సాగునీటి కల నెరవేరింది. గోదావరి నదికి నడకలు నేర్పుతూ సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం ప్రారంభంకావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సినీ,రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో అద్భుతం ఆవిష్కృతమైందని,ఇంజనీర్ల కృషితో కాళేశ్వరం సాధ్యమైందని సినీనటుడు రవితేజ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ సీఎం కేసీఆర్,కేటీఆర్‌ కృషిని కొనియాడారు.

నీరే జీవం !! ప్ర‌పంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు శుభాకాంక్ష‌లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ల అద్భుత ప్ర‌తిభ‌కి నిద‌ర్శ‌నం అని ట్వీట్ చేశారు అక్కినేని నాగార్జున.

- Advertisement -