గ్రీన్ ఛాలెంజ్‌లో కళామందిర్ డైరెక్టర్ సుభాష్

1
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు కళామందిర్ డైరెక్టర్ సుభాష్.

ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ..నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మొక్కలు నాటడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.పచ్చదనం పెంచడం కోసం సంతోష్ కుమార్ చాలా గొప్ప కార్యక్రమం చేపట్టారని దీని మనందరం ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

Also Read:గేమ్ చేంజర్..సాంగ్ ప్రోమో

- Advertisement -