- Advertisement -
భారతీయుడు సినిమాకు సీక్వెల్ వార్త తెరపైకొచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా 2 దశాబ్ధాల క్రితం విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది.అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా ఈ సినిమాకు రిమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా శంకర్ రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఎంపిక ఖరారైంది. ఈ సందర్భంగా కాజల్ చెబుతూ ఇన్ స్టిట్యూషన్ వంటి కమల్ తో, శంకర్ వంటి దర్శక దిగ్గజంతో పనిచేసే అవకాశం కలగడంతో తన చిరకాల స్వప్నం సాకారమైందని పేర్కొంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూడు భాషల్లోనూ నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు.
- Advertisement -