బీజేపీ నేతలవి చిల్లర మాటలు: కడియం

40
kadiyam
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌తో ధనికులు మరింత ధనికులుగా,పేదవారు మరింత పేదవారుగా మారుతారని మండిపడ్డారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని… ఇప్పటివరకు విభజన చట్టం హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండగగా గుర్తించాలని అడిగితే ఇప్పటివరకు స్పందించలేదని.. బీజేపీ నేతలు చేతగాని సన్నాసులు అని విమర్శించారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు.

ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దేశంలో షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందినవారు 28 శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.20వేల కోట్లు కేటాయించిందని.. అదే దళిత బంధు కోసం ఒక్క తెలంగాణ ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చుపెడుతోందని తెలిపారు.

- Advertisement -