సీఎం రేవంత్‌పై కడియం ఫైర్

9
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ని ఉద్దేశించి మగాడివైతే ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూడాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సరికాదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాల సోనియా, అగ్రనేత ప్రియాంక ఇద్దరూ ఆడవారేనని గుర్తుంచుకోవాలన్నారు.

రేవంత్ రెడ్డి మగాడివైతే ఒక్క సీటు గెలిచుకోమని మమల్ని అంటున్నారు. నిన్నటి వరకు మల్కాజ్ గిరి ఎంపీ గా ఉన్న రేవంత్…ఆ పార్లమెంట్ పరిధిలో ఒక్క అసెంబ్లీని ఎందుకు గెలుచుకోలేక పోయారన్నారు. నిజంగా నీకు అంత సత్తానే ఉంటే, మగాడివి అయితే తెలంగాణ లో ఉన్న 17 ఎంపీ స్థానాలు గెలిపించి చూపించు అంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు కడియం చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచేశాయి.

Also Read:కృతి శెట్టి ఇంత దిగజారిపోయిందేంటి?

- Advertisement -