Kadiyam:గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు

29
- Advertisement -

గవర్నర్ తమిళి సై ప్రసంగంలో కొత్తదనం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కడియం.. అభివృద్ధి కి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉందని….పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని విస్మరించారన్నారు. తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. .నీతి ఆయోగ్ ప్రశంసలు ,కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారన్నారు.

ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నెంబర్ వన్ ,ఐటీ ఎగుమతుల్లోసాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదని…ఆమె స్థాయికి తగదన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం అని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారన్నారు. 2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యింది ..ఇపుడు కావడమేమిటో అన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని…..దళిత బంధు ప్రస్తావన లేదన్నారు. రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదు….కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని ఆరోపించారు.

Also Read:ప్రభుత్వ విప్‌గా బీర్ల ఐలయ్య

- Advertisement -