నర్సాపురం ఎంపీ బరిలో కేఏ పాల్..

278
ka paul
- Advertisement -

క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు పోటీచేసే స్ధానం ఖరారైంది. పవన్ ఎక్కడి నుండి పోటీచేస్తే తాను అక్కడి నుండి పోటీచేస్తానని ప్రకటించిన పాల్ నర్సాపురం ఎంపీగా పోటీచేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి పవన్ పోటీచేస్తుండగా నర్సాపురం ఎంపీగా పాల్ పోటీచేస్తున్నారు.

నర్సాపురం పార్లమెంట్ స్థానంతో పాటు మరో స్ధానం నుండి పోటీచేస్తానని ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపిన ఆయన ఇవాళ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మార్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే సాధ్యమన్నారు. హెలికాప్టర్‌లలో తిరుగుతున్న నేతలకు ఓట్లు వేయొద్దని, కానీ హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి బోండా ఉమ తనకు ఫోన్ చేసి ఆశీస్సులు కోరారని పాల్ తెలిపారు.

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, తాను సీఎం కావడం తథ్యమని పాల్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. చంద్రబాబు అంగీకరిస్తే ఆయన్ని తన సలహాదారుడిగా నియమించుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు పవన్‌ తనతో కలిస్తే మహిళా శాఖ కేటాయిస్తానని ఎద్దేవా చేశారు. అయితే చాలామంది ఆయన్ని జోకర్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోని పాల్ తన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

- Advertisement -