- Advertisement -
10 రోజుల విదేశీ పర్యటను వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చారని దుయ్యబట్టారు కేఏ పాల్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన పాల్… అమెజాన్, మైక్రోసాఫ్ట్తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయా..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రులందర్నీ తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పాను. ఇప్పటికే సీఎంలతో అనేక మీటింగ్లు పెట్టాను. అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని చెప్పాను కానీ పట్టించుకోలేదన్నారు. ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరు నమ్మరు అని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది అన్నారు.
రేవంత్ రెడ్డి నాతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించే వాడిని – కేఏ పాల్ pic.twitter.com/5yTNBCrk5d
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2024
Also Read:జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదంపై వదంతులు
- Advertisement -

