రామ్ గోపాల్ వర్మ పై కేసు పెట్టిన కేఏ పాల్ కోడలు

556
KA Paul Rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సిద్దార్ద తాతోలు తెరకెక్కించిన చిత్రం అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఈ మూవీ విడుదలకు ముందే వివాదస్పదంగా మారింది. సినిమాకు సెన్సార్‌ చిక్కులు వీడి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలో మరో వివాదంలో ఇరుక్కున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇటివలే సెన్సార్ బోర్డు ఈసినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరిచింది. తాజాగా ఈసినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శకుడు వర్మ. అయితే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ తో కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ.

ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో పై కేఏ పాల్ కోడలు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్స్‌లో కేసు నమోదయింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌కు ఆర్జీవీ తమ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో దిగిన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారన్న ఆమె.. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది. దీంతో రామ్ గోపాల్ వర్మపై సెక్షన్ 469పై కేసు నమోదు చేశారు. ఈవిషయంపై వర్మ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -