అమరవీరులకు నివాళులర్పించి కేకే, సురేశ్‌రెడ్డి

408
trs
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం నామినేషన్ వేయడానికి వెళ్లారు. వీరు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆరెస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -