జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా‌..!

241
Jyotiraditya Scindia
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రేటీల వరకు ఎవరినీ వదలడం లేదు. దీని దాటికి ఎంతో మంది విలవిలలాడుతున్నారు. తాజాగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయనతో పాటు ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన బడ్డారు.

వీరికి కరోనా పాజిటివ్ తేలడంతో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా సింధియాలకు చికిత్స అందుతోంది. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు. ప్రస్తుతం వీరికి పూర్తి స్థాయిలో వైద్యం అందుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. 1,29,917 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,215 మంది కోలుకున్నారు.

- Advertisement -