మొక్కలు నాటిన సినీ నటుడు జ్వాల చక్రవర్తి..

318
jwala chakravarthi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినీ నటుడు జ్వాల చక్రవర్తి….అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు జ్వాల చక్రవర్తి అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సామాజిక సేవకర్త శాంతి పూర్ణ గుప్తా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కృష్ణ నగర్ లో మొక్కలు నాటిండ్రు.అనంతరం మరో ముగ్గురు ( నటులు తిలక్ , పసునూరి శ్రీనివాస్ , సాకేత్ మాధవి )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని నటుడు జ్వాల చక్రవర్తి పిలుపునిచ్చారు.

- Advertisement -