“జువ్వ” ఆడియో విడుదల

188
guvva
- Advertisement -

సోమి ఫిలిమ్స్ పతాకంపై రంజిత్, పాలక్ లల్వాని జంటగా భరత్ సోమి నిర్మించిన చిత్రం జువ్వ. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుకలు ఆదివారం హైదరాబాదు లో ఘనంగా జరిగాయి. బొత్స సత్యనారాయణ , ఆయన సతీమణి బొత్స ఝాన్సీ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, అడివి శేష్, హాస్య నటులు ఆలీ ,సప్తగిరి,భద్రం,చిత్ర దర్శకుడు త్రికోటి, మాటల రచయిత రత్నం, మలయాళ నటుడు అర్జునా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఆడియో సి.డి. ని విడుదల చేసారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ” దర్శకుడు త్రికోటి నాకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి. అతని మొదటి సినిమా దిక్కులు చూడకు రామయ్య చిత్రానికి కూడా నేనే సంగీతం అందించాను.ఇది పక్కా కమర్షియల్ సినిమా. ప్రేక్షకులకు ఒక విందు భోజనం లాంటిది అని అన్నారు.  మాటల రచయిత ఎం.రత్నం మాట్లాడుతూ “త్రికోటికి నాకు పాతిక సంవత్సరాల స్నేహం ఉంది. చాలా తెలివైన దర్శకుడు. కథ కు సంబందించిన ట్రీట్మెంట్ విషయం లో చాలా ఖచ్చితంగా ఉంటాడు.సీన్ నచ్చేదాకా తనకు కావలసిన విధంగా రాసివ్వాలి. ఈ సినిమా అతనికి మంచి దర్శకుడిగా గుర్తింపు ఇస్తుంది. అలాగే నిర్మాత భరత్ లో ప్రొడ్యూసర్ తో పాటు ఒక రచయిత కూడా ఉన్నాడు.

నటుడు ఆలీ మాట్లాడుతూ ” సాదారణంగా కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీ కి హీరొయిన్ లు వచ్చేవారు. కానీ మొదటిసారిగా అర్జునా అనే విలన్ ని పరిచయం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని, సినిమా మంచి హిట్ సాధిస్తుందని అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ ” కీరవాణి గారికి నేను పెద్ద అభిమానిని. కేవలం పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం బాహుబలి సినిమాను 7 సార్లు చూసాను. అలాగే ఈ జువ్వ సినిమాలో డిఫరెంట్ గెటప్ లతో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసాను. సినిమా చాలా బాగుందని అన్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ” మా కుటుంబానికి ఆప్త మిత్రుడు బొత్స సత్యనారాయణ వారి సతీమణి బొత్స ఝాన్సీ గారు మరియు వారి అల్లుడు ఈ సినిమా నిర్మాత భరత్ సోమి గారికి శుభాకాంక్షలు. తమ్ముడి మీద అభిమానంతో హీరో గా పరిచయం చేస్తున్న భరత్ కు అభినందనలు. ఈ సినిమా ద్వారా రంజిత్ కు మంచి నటుడుగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కీరవాణి గారు ఈ సినిమా కు సంగీతం అందిచడం చాలా గొప్ప విషయం. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటేనే సంగీతం అందిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అన్నారు.

దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ: నాకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాతలు సాయి కొర్ర్రపాటి గారికి, రాజమౌళి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా అవకాశం కల్పించిన మహేంద్ర గారికి కూడా కృతజ్ఞతలు. దర్శకుడిగా ఇది నాకు రెండవ అవకాశం. నా లాంటి కొత్త వాడి సినిమా కు సంగీతం ఇచ్చిన కీరవాణి గారు నిజంగా నాకు దేవుడుతో సమానం. ఆయన ఋణం తీర్చుకోలేనిది. నేను చేస్తున్న ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మా యూనిట్ అందరికి ధన్యవాదాలు.

హీరో రంజిత్ మాట్లాడుతూ: నా మొదటి సినిమా కే లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు సంగీతం అందించటం నిజంగా నా అదృష్టం. నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇన్ని రోజులుగా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన మా అమ్మా నాన్నలకి , మా అన్నయ్య భరత్ కి చాలా చాలా థాంక్స్. అలాగే బొత్స అంకుల్ కి థాంక్స్. సినిమా కథ చాలా బాగుంది. నిజానికి కథే హీరో. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది”. అన్నారు.

నిర్మాత భరత్ మాట్లాడుతూ… సినిమా చాలా బాగా వచ్చింది. రత్నం గారి డైలాగ్స్ బాగున్నాయి. హీరొయిన్ పాలక్, విలన్ అర్జునా ఇద్దరూ చాలా బాగా నటించారు. ఫెబ్రవరి ౨౩ న సినిమా విడుదల చేస్తున్నాము. అందరూ ఆశీర్వదించి సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. “అన్నారు.

- Advertisement -