శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సంతోష్ రెడ్డి…

89
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్ సంతోష్ రెడ్డి. ఇవాళ ఉదయం తిరుమల చేరుకున్న సంతోష్‌ రెడ్డి… వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆయనకు ఆలయన అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. గురువారం 67,625 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రూ.4.05 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది.

- Advertisement -