న్యాయం గెలిచిందిః ప్రధాని మోదీ

361
modi
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలైంది. ఈ రోజు   ఉదయం 5.30గంటలకు నలుగురు దోఘుల్ని ఉరి తీశారు. దోఘులను ఉరి తీయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు.

నిర్భయ దోఘుల ఉరి అమలుపై స్పందించారు ప్రధాని మోదీ. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని ట్వీట్ చేశారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, గౌర‌వానికి ప్ర‌త్యేక గుర్తింపు ఇవ్వాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. మ‌న నారీశ‌క్తి ప్ర‌తి రంగంలో ఉత్త‌మంగా రాణిస్తోంద‌న్నారు. మ‌హిళా సాధికార‌త‌తో దేశాన్ని పురోగ‌మించే విధంగా చూడాల‌న్నారు.

- Advertisement -