హైకోర్టు సీజేగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

74
- Advertisement -

తెలంగాణ జస్టీస్‌గా బాధ్యతలు చేపట్టారు అలోక్ అరాధే. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ అలోక్ అరాధే 2009లో హైకోర్టు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2018 న‌వంబ‌ర్ నుంచి క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని అలోక్‌ని సిఫార్సు చేయగా ఆయన తెలంగాణ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొన‌సాగుతున్న‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read:హిడింబ..బ్లాక్ బస్టర్ హిట్

- Advertisement -