ప్రభాస్ తో ఎన్టీఆర్.. బాక్సాఫీస్ బద్దల్?

9
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు టాలీవుడ్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సంపాధించుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఇంకేమైనా ఉందా ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. ప్రస్తుతం ఈ కాంబినేషన్ పై ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న మూవీ ” కల్కి 2898 ఏ. డి “. పిరియాడిక్ సైంటిఫిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీ విని ఎరుగని రీతిలో నాగ్ అశ్విన్ ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. .

ఈ మూవీలో ఇప్పటికే చాలామంది బిగ్ స్టార్స్ నటిస్తున్నారు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్.. ఇలా భారీ తారాగనమే ఉంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని ఇటీవల వార్తలు బాగానే వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. కల్కి మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం నాగ్ అశ్విన్ ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమనే చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దాంతో వైరల్ అవుతున్న వార్తాలు రుమార్సేనని కొట్టి పారేస్తున్నారు కొందరు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీని ఇదే ఏడాది మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

Also Read:ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చ‌జెండా

- Advertisement -