ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్!

54
ntr
- Advertisement -

రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మన అస్త్రాల గురించి రాసిన కథతో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

అయితే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. దీంతో అభిమానులకు సారీ చెప్పారు ఎన్టీఆర్. ఈ బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నాం. దీనికి అన్ని రెడీ చేశారు.కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులంతా బిజీగా ఉండటం వల్ల ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు కూడా మన రక్షణ కోసమే పని చేస్తారు. అందుకే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. ఈవెంట్ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులందరికి క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపారు.

మనం దేశంలో ప్రస్తుతం చాలా మంచి పొజిషన్ లో ఉన్నాము. ఇటీవలే 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక ప్రెజర్ కు గురవుతుంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ ప్రేక్షకులు ఇచ్చిన ఛాలెంజ్ ని తీసుకొని మంచి సినిమాలు తీయాలన్నారు.

- Advertisement -