ఎన్టీఆర్‌కు తారక్ నివాళి..

113
- Advertisement -

మాజీ ముఖ్య‌మంత్రి, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నివాళి అర్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఉద‌యం ఐదు గంట‌ల ప్రాంతంలో అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన తారక్‌…ఘన నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ అక్క‌డ‌కు చేరుకున్న స‌మ‌యంలో భారీగా అభిమానులు వ‌చ్చారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉంది.ఇదే నెల‌లోనే తార‌క్ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -