హ్యాట్సాఫ్…చరణ్‌

286
- Advertisement -

మెగా హీరో రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. రామ్‌చరణ్ తొలిసారి భిన్నపాత్రలో నటించడం, పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకుడిని కట్టిపడేసింది.

విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్న రంగస్థలం చిత్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ …రంగస్ధలం టీమ్‌పై ప్రశంసలు గుప్పించారు. ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఎన్టీఆర్ హ్యాట్సాఫ్ అంటూ పేర్కొన్నారు. ఇప్పుడే రంగస్ధలం చూశాను…మరెవరూ ఇంతకంటే బాగా చేయలేరని కితాబిచ్చాడు. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపిన సుకుమార్‌కు అభినందనలు. అప్పటికాలానికి తగినట్లు ఓ భావోద్వేగ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ధైర్యానికి అభినందనలు. సమంత, దేవిశ్రీప్రసాద్‌, మైత్రి మూవీస్‌, ‘రంగస్థలం’ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

విడుదలైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ 2 మిలియన్ డాలర్లు ఆర్జించింది.

ram charan

- Advertisement -