దిల్‌కు.. ఎన్టీఆర్ ‘ఊ’ కొడతాడా!

277
Jr NTR next is Srinivasa Kalyanam...!
- Advertisement -

టెంపర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నాడు.

ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. గతంలో దిల్ రాజు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బృందావనం’ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.   గ్రామీణ వాతావరణంలో సాగే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దిల్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో మరోసారి ఎన్టీఆర్‌ పై భారం వేశాడు దిల్.

తన సొంత బ్యానర్ పై శ్రీనివాస్ కళ్యాణం టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. తొలుత ఈ  సినిమాకు రాజ్ తరుణ్ లేదా శర్వానంద్ లతో చేయాలని భావించాడు. కానీ  కుటుంబ విలువలు, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమాను ఎన్టీఆర్ తో నిర్మించాలని రాజు ప్లాన్ చేశాడట. ఈ చిత్రానికి గాను దిల్‌రాజు తారక్‌కు భారీ పారితోషికం ఆఫర్‌ చేసినట్లు టాలీవుడ్‌ టాక్‌. మరి దిల్‌తో తారక్‌ ఊ కొడితే.. సినిమా విడుదలకు ముందే అంచనాలు మరింతగా పెరిగేఅవకాశం ఉంది.

- Advertisement -