జూనియర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జై లవకుశ. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘జై లవ కుశ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో యంగ్టైగర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని జై అనే పాత్రకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ లుక్ తో కనిపించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై, యూట్యూబ్ లో దూసుకుపోయింది.
అయితే తాజాగా ఈ టీజర్పై దర్శకుడు పూరీ సంచలన విషయం బయటపెట్టాడు. గతంలో తాను చెప్పిన ఓ ఐడియాను ఈ సినిమాలో ‘జై’ కేరక్టర్ కి ఎన్టీఆర్ ఉపయోగించుకున్నాడని ఆరోపించినట్టు ఒ వార్త వినిపిస్తుంది. అయితే ఈ కథను పూరీ జగన్నాధ్ గతంలోనే ఎన్టీఆర్కు చెప్పారట. ముందుగా పూరీ నుండి కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించారని, దానికి పూరీ అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను అక్కడితో ఆపేసారని, ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్న తరుణంలో తాను చెప్పిన కధలోని పాత్ర ‘జై లవకుశ’ రూపంలో ముందుకు రావడంతో పూరీకి అసలు ట్విస్ట్ ఎదురైనట్లుగా సమాచారం.
అయితే ఈ విషయంపై ఇద్దరూ మాట్లాడుకుని రాజీ కుదుర్చుకున్నట్టు సిని వర్గాల సమాచారం. అంతేకాకుండా, పూరీకి మరోసారి దర్శకత్వం అవకాశం ఇస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట. దీనికి పూరీ కూడా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇకపై ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడబోనని ఎన్టీఆర్ కు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చాడట. మరి వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.