ఓటేసిన బన్నీ,ఎన్టీఆర్,కవిత

51
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌ల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు అంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బన్నీ సైతం ఉదయాన్ని వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు ,హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పోలింగ్ రోజున గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా బర్కత్‌పురలోని బాగ్‌లింగంపల్లి దీక్ష మోడల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read:Telangana Assembly:బారులు తీరిన ఓటర్లు

- Advertisement -