జాన్వీ కపూర్ తో పాటలు.. ఎన్టీఆర్ బిజీ

30
- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో క్రేజీ సినిమాగా తెరకెక్కుతున్న దేవర ప్రస్తుతం పాటల షూటింగ్ తో బిజీ ఉన్నాడు. సరిగ్గా నెల రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేయాలనీ కొరటాల శివ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, ఇంకో రెండు నెలలు వరకూ షూటింగ్ పూర్తి కాదు అని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన చివరి రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. గోవాలో తీద్దామనుకున్న పాటని కూడా టైం లేదనే కారణంతో ఇక్కడే తీస్తున్నారు. “దేవర పార్ట్ 1” సినిమాని స్పీడ్ గా పూర్తి చెయ్యాలని భావించారు కొరటాల శివ. ఐతే, ఈ సినిమా పార్ట్ 1 షూటింగ్ కి అనేక అడ్డంకులు వచ్చాయి. వాటిని అధిగమించేసరికే చాలా టైం ముగిసింది.

మొత్తానికి సన్నివేశాలు, ఫైట్స్ తొందర్లోనే పూర్తి చేశారు. దేవర పార్ట్ 1 పాటలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. పాటల చిత్రీకరణ చివర్లో చేసినా సమస్య ఉండదు. ఎందుకంటే, వీటి ఎడిటింగ్ కి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్ద టైం పట్టదు. అందుకే, ఈ పనిని చివర్లో పెట్టుకున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్. అటు జాన్వీ కపూర్ కి కూడా డ్యాన్స్ లో మంచి పేరు ఉంది. అందుకే, ఈ ఇద్దరి పై చేస్తున్న పాటల షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందట. పూర్తిగా భారీ యాక్షన్ విజువల్ డ్రామాగానే తెరకెక్కుతోంది ఈ సినిమా. ఐతే, ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన మసాలా, ఫైట్లు అవీ ఫుల్లుగానే ఉంటాయి.

అందుకే, తారక్ ఫ్యాన్స్ కూడా దేవర పై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను కొరటాల శివ ఎంతవరకు అందుకోగలడు ? అనేది చూడాలి. అన్నట్టు దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దేవర రెండో పార్ట్ ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచే షూటింగ్ చేస్తారట. పైగా విలన్ సైఫ్ అలీఖాన్ సరసన రమ్యకృష్ణ ఈ సినిమాలో నటిస్తోందట. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:డిప్యూటీ సీఎం నివాసంగా ప్రజాభవన్

- Advertisement -