పొత్తుల ప్రస్తావన వద్దు: నడ్డా

66
bjp
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది బీజేపీ. ఇందులో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ సందర్భంగా పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. పొత్తుల ప్రస్తావన పక్కకు పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని గట్టిగా చెప్పారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

విజయవాడ నుంచే బీజేపీ విజయం ఢంకా మోగించాలని కార్యకర్తల్లో జేష్ ను నింపారు. ఇదే సభా వేదిక పై నుంచి జగన్ ప్రభుత్వ తీరుపై దగ్గుబాటి పురంధరేశ్వరి, సోము వీర్రాలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ బలమెంత అని జాతీయ నాయకులు అడుగుతున్నారని, ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని ప్రతిఒక్కరూ పార్టీబలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

- Advertisement -