జియో నుండి మరో ఆఫర్‌.. 699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

247
- Advertisement -

జీవీ మొబైల్స్ సంస్థతో భాగస్వామ్యం అయిన జియో టెలికాం సంస్థ రిలయన్స్ రూ.699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నది. జీవీ మొబైల్స్‌కు చెందిన ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్‌ను కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో రూ.2,899 ధరకు లభిస్తుండగా, ఇదే ధరకు ఈ ఫోన్‌ను కొని అందులో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌ను జియో యాప్ లేదా సైట్‌లో రీచార్జి చేసుకోవాలి.

అనంతరం రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో వస్తుంది. ఒక్కొక్కటి రూ.50 విలువ గల మొత్తం 44 వోచర్లు యూజర్‌కు చెందిన జియో అకౌంట్‌లో ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ అవుతాయి. వీటిని తరువాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.699 మాత్రమే అవుతుంది.

Jivi 4G smartphone to cost Rs 699 under Jio offer

జియో ఈ ఆఫర్‌ను తన ఫుట్‌బాల్ ఆఫర్‌లో భాగంగా అందిస్తుండగా, దాదాపుగా అనేక కంపెనీలకు చెందిన 4జీ ఫోన్లపై కూడా రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పైన చెప్పిన విధంగా వస్తుంది. ఇక జీవీ మొబైల్స్‌కు చెందిన ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్‌లో 4 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. జీవీ కంపెనీకి చెందిన మరో స్మార్ట్‌ఫోన్ ప్రైమ్ పీ444పై కూడా జియో ఫుట్ బాల్ ఆఫర్ లభిస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.4,799 ఉండగా, రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పోను దీని ధర రూ.2599 అవుతుంది.

- Advertisement -