జియో న్యూఇయర్ బంపర్ ఆఫర్

523
jio
- Advertisement -

ప్రముఖ టెలికాం సంస్ధ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు నూతన ఆఫర్ ను అందుబాటులో ఉంచింది . రూ.2020తో రిఛార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ ఎంఎస్ లు, జియో టూ జియో ఫ్రీ, అలాగే నాన్ జియో కాల్స్ కి 12వేల ఉచిత నిమిషాలు రానున్నాయి. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న 1 ఇయ‌ర్ వాలిడిటీ ప్లాన్ల క‌న్నా ఈ ప్లాన్ రూ.179 త‌క్కువకే ల‌భిస్తుంచనుంది.

వచ్చే సంవత్సరం 2020సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టారు. అదే విధంగా జియో ఫోన్ పై కూడా ఆఫర్ ను ప్రకటించారు. జియో ఫోన్ ను కొనుగోలు చేసే వారు రూ.2020తో రిఛార్జ్ చేస్తే ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 0.5జీబీ డేటా లభించనుంది. అలాగే ఈ రెండు ప్లాన్ల‌లోనూ జియో యాప్స్‌కు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ల‌భిస్తుంది. ప్రతి పండగకి జియో సంస్ధ కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -