జవాన్ సునామీ.. రెండు రోజుల్లో 250 కోట్లు

18
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టి, ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది.తాజాగా రెండోరోజు జవాన్ సునామీ కొనసాగింది.

రెండోరజోజు ఏకంగా రూ.113 కోట్లు వసూలు చేసింది. ఇక వీకెండ్ కావడంతో జవాన్ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం పూర్తయ్యే సరికే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జవాన్‌ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10వేల థియేటర్లలో విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లోనూ రిలీజ్‌ అయింది. మక్కల్ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, బాలీవుడ్‌బ్యూటీ దీపికా పదుకొణె, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read:శ్రీను వైట్లతో గోపిచంద్ @ 32

- Advertisement -