జాన్వీ కొత్త ఇల్లు..ఎక్కడో తెలుసా…

231
- Advertisement -

తన అందంతో కుర్రకారు యువత మదిని దోచుకున్న అలనాటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుందట. కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది.  తాజాగా జాన్వీ నటించిన మిలీ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. కాగా ఈ బాలీవుడ్‌ నటి బ్యూటీ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగొలు చేసినట్లు బాలీవుడ్‌లో టాక్.

ముంబై బాంద్రా ప్రాంతంలో రూ.65కోట్లతో ఓడూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేసిందట. తన తండ్రి బోనీ కపూర్‌ చెల్లి ఖుషీ కపూర్‌తో కలసి ఈ ఇంటిని ఉంటున్నట్టు సమాచారం. బాంద్రా వెస్ట్‌లోని యూనియన్ పార్క్‌ రోడ్డులో గల పాలిహిల్‌లో కుబెలిస్క్‌ బిల్డింగ్ 101, 102అపార్ట్‌మెంట్‌లో మొదటి రెండో అంతస్తులో ఈ డూప్లెక్స్ నిర్మించారట.

ఓపెన్ గార్డెన్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, ఐదు కార్లు పార్క్‌ చేసుకునేందుకు వీలుగా ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. 2022 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తైనట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

BB6..ఫైమాని ఉతికిఆరేసిన ఇనయ!

హైదరాబాద్..రియల్ భూమ్ తగ్గేదెలే

సల్మాన్‌తో తెలుగు బాక్సర్‌ స్టెప్పులు

 

- Advertisement -