తెలంగాణ‌లో ఎవ‌రికి ఓటు వేయాలో చెప్పిన జ‌న‌సేనాని..

280
pawan kalyan
- Advertisement -

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 7న జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికి ఓటు వేయాలో చెప్పారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్. తెలంగాణ ఉద్య‌మ స్పూర్తిని , త్యాగాల‌ను పూర్తిగా అర్ధం చేసుకున్న వ్య‌క్తిని తాన‌ని తెలిపారు. త‌న‌కు తెలంగాణ అంటే చాలా ఇష్ట‌మే కాకుండా ఎంతో గౌర‌వం కూడా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో త‌మ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్దంగా లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

janasena

సమయం తక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ సమయాన్ని తాను కేటాయించలేక పోతుండటం వల్ల… ఇక్కడ జనసేన పోటీ చేయలేకపోయిందని చెప్పారు. తెలంగాణను ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు మన ముందు ఉన్నారని… వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో అందరూ ఉన్నారని తెలిపారు.తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలనను అందిస్తారో… లోతుగా ఆలోచించి వారికి ఓటు వేయాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ది ఎవ‌రితో అయితే సాధ్య‌మ‌వుతుందో వారినే ఎన్నుకోవాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -