సత్యసాయి ఆరాధ్యనీయుడు- పవన్‌

430
JanaSena Chief Pawan Kalyan Visits Sathya Sai Baba Tomb
- Advertisement -

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ అనంతపురం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సత్యసాయి సమాధిని దర్శించారు పవన్. అంతేకాకుండా అక్కడే ఉన్న అత్యాధునిక ఆసుపత్రిని కూడా సందర్శించారు.

అంతకుముందే.. ఉదయం ప్రశాంతి నిలయంలోని శాంతి‌భవన్‌లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దాదాపు అర్థగంటకుపైగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

 JanaSena Chief Pawan Kalyan Visits Sathya Sai Baba Tomb

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌.. పుట్టపర్తి ఆసుపత్రి అనేక ప్రభుత్వాలకు ఆదర్శమని అన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడే సత్యసాయి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ప్రస్తుతం స్వయంగా చూశానని, ఇక్కడికి రావడం తన అదృష్టమని చెప్పారు.

- Advertisement -