జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్‌ భేటీ

354
pawan Kalyan Jp Nadda
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రెండు రోజుల పర్యటన అనంతరం నేడు బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అంతకుముందు పలువరు బీజేపీ నేతలతో పవన్ భేటీ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై జనసేన వర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఒక్క సారిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం..బీజేపీ పెద్దలను కలవడంతో ఏపీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. బీజేపీతో జనసేన పొత్తు అంశంపైనే పవన్ కళ్యాణ్ ఢిల్లికి వెళ్లారని ప్రచారం జరుగుతుంది.

Pavan

ఈ మేరకు నడ్డాతో పవన్ చర్చలు జరిపారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీ రాజధాని అంశంపై నడ్డాతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర జోక్యం చేసుకోవాలని ఢిల్లీ పెద్దలను పవన్ కల్యాణ్ కోరినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటి చేస్తాయని తెలుస్తుంది. నడ్డాతో సమావేశం ముగిసిన అనంతరం నేరుగా కాకినాడకు వెళ్లనున్నారు పవన్. ఇటివలే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు.

- Advertisement -