కొత్తపేట ఆలయంలో గుడి గుడికో జమ్మిచెట్టు

3
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఊరు ఊరికో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం లో భాగంగా ఈ రోజు కొత్తపేట్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ పరిదిలో BRSV రాష్ట్ర కార్యదర్శి NN రాజు ఆధ్వర్యంలో జమ్మి వృక్షం నాటారు వేద పండితులు.

ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాహుల్ అయ్యగారు, శశి అయ్యగారు,సతీష్,నితిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:హుజుర్‌నగర్‌కు పారిశ్రామిక శిక్షణా సంస్థ

- Advertisement -