మైసిగండి దేవాలయంలో జమ్మి చెట్టు

1
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం లో భాగంగా ఇవాళ మైసిగండిలోని దేవాలయ పరిదిలో జమ్మి చెట్టును నాటారు ఈవో స్నేహలత , ఫౌండర్ లక్ష్మి శిరోలత పంతు, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు నర్సింహా రెడ్డి ,మాజీ సర్పంచ్ తులసి రామ్ మరియు వేద పండితులు.

మాజీ సర్పంచ్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ మైసిగండి అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రామ్ దాస్ నాయక్, మహేష్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఆ సమస్య ఉంటే..బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే!

- Advertisement -