ప్రభుత్వ లాంఛనాలతో నేడు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

436
Jaipal Reddy DeadBody
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనారోగ్యంగా మృతి చెందిన సంగతి తెలిసందే. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నెక్లెస్ రోడ్డు లోని మాజీ ప్రధాని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లుపై సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ జైపాల్ రెడ్డి పార్ధివదేహాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఈరోజు ఉదయం 10గంటలకు పార్ధివదేహాన్ని గాంధీ భవన్ కు తరలించనున్నారు. అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం కోరకు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీగా తీసుకెళ్లనున్నారు.

- Advertisement -