ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఒక పాత్ర పేరు లవకుమార్, మరో పాత్ర పేరు జై అని తెలుస్తుండగా మూడో పాత్రకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. రాశిఖన్నా, నివేధా థామస్ లు కథానాయికలుగా నటించనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.
అయితే ఎన్టీఆర్ అభిమానులకు నందమూరి కల్యాణ్ రామ్ ఈ రోజు శుభవార్తను వినిపించారు. బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం టీజర్ ను ఈ నెల 6 సాయంకాలం 5.22 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత కల్యాణ్ రామ్ ప్రకటించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘జై, లవ, కుశ’ అనే మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్న సంగతి విదితమే. అందులో జై పాత్రకు సంబంధించిన టీజర్ ను ఆ రోజు ముందుగా విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలపై కట్ చేసే టీజర్లను రిలీజ్ చేయాలని వెరైటీగా ప్లాన్ చేశారు. కాగా, ముందుగా రిలీజ్ చేస్తున్న జై పాత్ర నెగటివ్ ఛాయలతో సాగుతుందని సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేయనున్నారు.