శ్రీ‌వారి సన్నిధిలో ఏపీ సీఎం జగన్‌..

8
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గౌ. ముఖ్యమంత్రివర్యులకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రివర్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రివర్యులకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:పిక్ టాక్ :రెచ్చిపోయిన హీరో కూతురు

- Advertisement -