Jagan:22 ఎంపీ స్థానాలు మనవే

11
- Advertisement -

ఏపీలో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలవబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన జగన్..జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు.

మరోసారి అధికారంలోకి వస్తున్నాం …2019 కంటే 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయన్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపికి ఎక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం అన్నారు.

ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది…రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని త్వరలో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్.

Also Read:Ponnam:పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం

- Advertisement -