జగన్‌మోహన్‌ రావుకు అరుదైన గుర్తింపు

286
ram mohan
- Advertisement -

దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్ కు తెలంగాణ కు చెందిన అర్శన పల్లి జగన్ మొహన్ రావు ను గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మెన్ గా హాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమించింది.

ప్రస్థుతం హాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న జగన్ మొహన్ రావుకు ఈ అత్యున్న గుర్తింపు దక్కడంతో తెలంగాణ క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హాండ్ బాల్ క్రీడకు ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న జగన్ మొహన్ రావుకు మార్చి 5 నుండి 25 వరకు జైపూర్ లో జరిగే ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్ ఇండియా పోటీలు నిర్వహించే బాధ్యతలు అప్పగించింది హాండ్ బాల్ ఫెడరేషన్.

తెలంగాణ టైగర్స్, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబయ్, బెంగళూర్ రాష్ట్రాల టీం లు ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొననున్నాయి. జగన్ మొహన్ రావు నియామకం పై హాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామసుబ్రమణి, జనరల్ సెక్రటరీ ఆనందేశ్వర్ పాండే అభినందించారు.

- Advertisement -