40 శాతం మంది ప్రజలు మనవైపే:జగన్

17
- Advertisement -

40 వాతం మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్…కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు మనకు మద్దతిచ్చారని ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని…ఈవీఎంల వ్యవహారాంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. చంద్రబాబు చేసే తప్పులను లెక్కించాలని.. టీడీపీ, బీజేపీ, జనసేన హనీ మూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇద్దామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

అసెంబ్లీలో వైసీపీ నోరు లేపకుండా టీడీపీ కట్టడి చేసే అవకాశం ఉందని …శాసన మండలిలో పోరాటం చేద్దామని అన్నారు. కేసులు పెడతారని, ప్రలోభాలు పెడతారని, తట్టుకోవాలని అన్నారు.

Also Read:OMG..రిలీజ్ డేట్ వచ్చేసింది!

- Advertisement -