కాంగ్రేస్ నేతలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి..

222
Jagadish Reddy
- Advertisement -

బానిస మనస్తత్వాలకు అలవాటు పడ్డ కాంగ్రేస్ నేతలకు రైతులు బాగుపడటం ఇష్టం లేదని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జూన్ 2 దశాబ్దాల కళ స్వరాష్ట్రం సాకారం అయిన రోజు… రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తాం, బ్లాక్ డేగా పాటిస్తాం అంటున్న కాంగ్రేస్ నేతలు ముమ్మాటికి తెలంగాణా ద్రోహులే అన్నారు మంత్రి. ఈ రోజు నియంత్రణ సాగు విధానంపై నల్లగొండలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రేస్ నేతలు అభివృద్ది నిరోధకులుగా మారారు.ప్రభుత్వం ఏ పని చేసిన వ్యతిరేఖించడం కాంగ్రేస్ పార్టీకి పరిపాటిగా మారింది. ప్రజలు ఛీదరించి కర్రు కాల్చి వాత పెట్టినా కాంగ్రేస్ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదని మంత్రి ఎద్దేవ చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తమ్ అసమర్దుడు అని, పీసీసీ పదవికి పనికిరాడని అంటున్నారు.

పదవుల కోసం సీమాంధ్ర నేతలకు అమ్ముడి పోయిన నీచ చరిత్ర ఉత్తమ్ ది. అసెంబ్లిలో ప్రాజెక్ట్ లపై మాట్లాడమంటె ప్రిపేర్ కాలేదు అని పరువు పోగొట్టుకున్న నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.మెన్నటికి మెన్న హుజూర్ నగర్‌లో ఉత్తమ్‌ని ఛిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు..అయినా తీరు మారలేదు.కాంగ్రేస్ పార్టీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -