Jagadish:కేసీఆర్ హవా మొదలైంది..

8
- Advertisement -

రాష్ట్రంలో కేసీఆర్ హవా మొదలైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూర్యాపేట నియోజ కవర్గంలో ఇంటింటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలే మాకు వివరిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్‌తోనే తమకు రక్ష అని …కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు తోడు దొంగలే అని, వారి రాద్ధాంతాలను ప్రజలు గమించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని వివరించారు.ఆరు రోజుల కేసీఆర్ పర్యటనతో వార్ వన్ సైడే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు తధ్యం అన్నారు.

బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. నోటీసుల డ్రామాతో మోదీతో రేవంత్ లోపాయికారీ ఒప్పందం బయటపడిందన్నారు. ఆ ఒప్పందంలో భాగమే రేవంత్ కి నోటీసుల డ్రామాలు అనీ ఆరోపించారు.

Also Read:Revanth:ఎవరికి భయపడం

- Advertisement -