‘జాను’ థాంక్స్ మీట్

376
Jaanu
- Advertisement -

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం చిత్ర‌యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో.,..

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – ‘‘ముందు ఈ సినిమాను క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ ప్రేమ్‌కి థాంక్స్‌. అంద‌రూ అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చే న‌టీన‌టులనే ఎంచుకున్నారు. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘అల‌వైకుంఠ‌పుర‌ములో’ ఇప్పుడు ‘జాను’తో ఈ ఏడాది అప్పుడే దిల్‌రాజుగారు హ్యాట్రిక్ కొట్టారు. ‘జాను’ చాలా అంద‌మైన ల‌వ్‌స్టోరీ ఇదే. క్లైమాక్స్‌ చూడ‌గానే కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను చూసిన ‘గీతాంజ‌లి’, నేను డైరెక్ట్ చేసిన ‘ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు` సినిమాల క్లైమాక్స్ చూసిన త‌ర్వాత శ‌ర్వా, స‌మంతల జాను అంతలా క‌దిలించింది’’ అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘మా డైరెక్ట‌ర్ ప్రేమ్‌, ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కీ థాంక్స్‌. అలాగే హీరో, హీరోయిన్ అన‌డం బెస్ట్ పెర్ఫామ‌ర్స్ అయిన శ‌ర్వానంద్‌, స‌మంత‌కు థాంక్స్‌. వారిద్ద‌రూ క‌ళ్ల‌తోనే న‌టించారు. అలాగే ఈ సినిమాలో న‌టించిన ఇత‌ర తారాగ‌ణానికి కూడా ధ‌న్య‌వాదాలు. తొలిరోజు నుండి ఇటు ఇండ‌స్ట్రీ నుండి అటు మీడియా, సోష‌ల్ మీడియా, ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ‘96’ సినిమా చూసిన తర్వాత తెలుగులో సినిమాను తీద్దామని అనుకున్నప్పుడు అప్‌క‌మింగ్ రైట‌ర్స్ కావాల‌నుకున్న‌ప్పుడు మా హ‌రిగారు మిర్చి కిర‌ణ్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. త‌ను చ‌క్క‌గా రాశారు. సినిమాను రీమేక్ చేస్తున్నామని అన్నప్పుడు చెడగొట్టేస్తారని, మేజిక్ రిపీట్ కాదని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా చాలా బావుంద‌ని అంటున్నారు. తెలిసిన వారికి సినిమా చూడ‌మ‌ని చెబుతున్నారు. ఫ్యామిలీ అంతా చూసే చిత్ర‌మిది. మా బ్యాన‌ర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు. సినిమా చూసిన ప్రేక్ష‌కులు క‌న్నీళ్ల రూపంలో వాళ్లేం చూశారో దాన్ని చెబుతున్నారు. సాధార‌ణంగా సినిమాలు తీసేట‌ప్పుడు లెక్క‌లు వేసుకుంటాను. కానీ ‘జాను’ సినిమాను తీయాల‌నుకున్న‌ప్పుడు నేను లెక్క‌లు వేసుకోలేదు. ఇలాంటి సినిమాను చూసి ఎంక‌రేజ్ చేసిన‌ప్పుడు మ‌రిన్ని మంచి సినిమాలు చేయ‌గ‌లం’’ అన్నారు.

స‌మంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘సినిమాను చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. ‘గీతాంజ‌లి’, ‘ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు’ వంటి గొప్ప సినిమాల‌తో మా సినిమాను, గొప్ప న‌టుల‌తో మ‌మ్మ‌ల్ని రాఘ‌వేంద్ర‌రావుగారు పోల్చ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. చాలా రోజులుగా హిట్స్ కొడుతున్నాం. కానీ… న‌టుడిగా ఏదో మిస్ అయ్యామ‌నే భావ‌న మ‌న‌సులో ఉండిపోయింది. అది ’జాను’ తీరింది. ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా మంచి కోరే వ్య‌క్తుల్లో ముందుండే వ్య‌క్తి రాజ‌న్న‌. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు థాంక్స్‌. న‌న్ను మంచి యాక్ట‌ర్ అని ఇప్పుడు పిలుస్తున్నారంటే ముందు మా డైరెక్ట‌ర్‌కే క్రెడిట్ ఇవ్వాలి. న‌న్ను రామ‌చంద్ర‌గా అద్భుతంగా మ‌లిచారు. అలాగే స‌మంత‌కు కూడా స‌గం క్రెడిట్ ఇస్తాను. నేను, స‌మంత తొలిరోజు నుండి జాను, రామ‌చంద్ర‌గా బెస్ట్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాం. ఆ స్కిప్ట్ మ‌మ్న‌ల్ని అలా చేయించింది. మా అమ్మ‌గారు, ఆవిడ స్నేహితుల‌తో క‌లిసి ఈ సినిమాను చూసి ఇంటికొచ్చి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంత బాగా వీళ్లు సినిమాకు క‌నెక్ట్ అయ్యారా? అని ఆనంద‌మేసింది. క్లాసిక్‌, మంచి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. మీరే ఎంక‌రేజ్ చేయాలి’’ అన్నారు.

- Advertisement -