టైగర్‌ నాగేశ్వరరావు మేకర్స్‌పై ఐటీ రైడ్స్

31
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ లో ఇప్పుడు ఐటీ మరియు జి ఎస్ టి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు బ్రేకింగ్‌గా మారగా ఆకస్మిక రైడ్స్‌తో షాక్‌కు గురయ్యారు మేకర్స్. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Also Read:టార్గెట్ లోకేశ్..సీఐడీ ప్లాన్ ఆదేనా?

- Advertisement -