ఈ ఏడాది అంతా శుభమే..తెలంగాణలో అద్భుత పాలన:బాచంపల్లి

61
bachampally
- Advertisement -

ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుందని….సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత పురగోమిస్తుందని తెలిపారు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి. ప్రగతి భవన్‌లో ఉగాది పంచాంగ పఠనం చెప్పిన బాచంపల్లి… రాష్ట్రంలో చీకటిరోజులు తొలగిపోయి మంచిరోజులు వచ్చాయని చెప్పారు.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. వేసవిలోనూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. జూలై నెల మధ్య నుంచి రైతులకు అద్భుతమైన కాలమని చెప్పారు. దేశం దృష్టంతా హైదరాబాద్‌పైనే ఉంటుందన్నారు.

శుభకృత్‌ నామ సంవత్సరంలో భూమండలమంతా అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాదంతా అందరూ ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రజారోగ్యం బాగుంటుదని, మాస్కులు అవసరం ఉండదన్నారు.

- Advertisement -