ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత : నిరంజన్ రెడ్డి

62
niranjanreddy
- Advertisement -

ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్న సంగతి తెల్సిందే.అయితే ఇస్టా 2022 – 2025 ఎగ్జిగ్యూటివ్ కమిటీ ఎన్నికల సంధర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత” అనే లక్ష్యం ద్వారా విత్తన నాణ్యత పరీక్షా వ్యవస్థలపరంగా అన్ని ప్రాంతాలను సమానం చేయడానికి మరియు అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా విత్తన వాణిజ్యాన్ని పెంచడానికి ఇస్టా కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడంలో నాణ్యమైన విత్తనానిది కీలక పాత్ర అన్నారు.

భారత వ్యవసాయోత్పత్తి ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ వస్తున్నదని తెలిపారు. ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు. జనాభాకు అనుగుణంగా పోషకాహార భద్రత పెద్దసవాలు గా మారిందన్నారు. ప్రపంచ జనాభా ఇప్పటికే 7.6 బిలియన్లకు చేరుకుంది మరియు 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరుతుందని అంచనా ఉందన్నారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాల కోసం ప్రపంచ అవసరాలు పెరుగుతాయన్నారు.

తొలిసారి ఆసియా నుండి, అందులో తెలంగాణ నుండి డాక్టర్ కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల గర్వంగా ఉందని, హర్షం వ్యక్తం చేశారు. 2022-25 కాలానికి కొత్తగా ఎన్నికైన ఇస్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, అని పేర్కొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమలకు మద్దతునిచ్చే ఇస్టా వారసత్వాన్ని కొనసాగించడం ఒక పెద్ద బాధ్యత అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి మరియు ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సమావేశం సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానన్నారు.

- Advertisement -