ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

6
- Advertisement -

ఇరాన్‌లోని గ్యాస్ కాంప్లెక్స్‌పై అదనపు దాడులను తాత్కాలికంగా నిలిపివేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి అని అన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో 20 రోజులలో ఇరాన్ యురేనియం శుద్ధి సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.

మొదటి దశలో క్షిపణుల నిల్వలు, డ్రోన్లు, అణు సంబంధిత సదుపాయాలు నాశనం అయ్యాయని, ప్రస్తుతం రెండో దశలో ఆయుధాల తయారీకి అవసరమైన పారిశ్రామిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపారు.

ఇజ్రాయెల్ మరియు అమెరికా చర్యలు “ప్రపంచాన్ని రక్షిస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో వందలాది క్షిపణి లాంచర్లు మరియు కీలక ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.

అమెరికా..హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇది విజయవంతమైతే ప్రపంచ చమురు ధరలు స్థిరపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

- Advertisement -